తపస్సు కాలం మిమ్ము ఒక ప్రత్యేకమైన కళాసృష్టిగా మలుస్తుందన్న పోప్

ఫిబ్రవరి 23, 2026 ,తపస్సు కాలం మొదటి ఆదివారం మధ్యాహ్నం త్రికాల ప్రార్థనలో పోప్ లియో  విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రభువు మిమ్మును పవిత్రులనుగా చేసి, మెరుగుపరచి, ఒక ప్రత్యేకమైన కళాసృష్టిగా మలచనివ్వండి” అని పిలుపునిచ్చారు.

యేసు అరణ్యంలో ప్రవేశించి సైతానుని ప్రలోభాలను ఎదుర్కొన్న సంఘటన (మత్తయి 4:1–11)ను పోప్ ప్రస్తావించారు. 

నలభై రోజుల ఉపవాసం అనంతరం క్రీస్తు మానవ బలహీనతను సంపూర్ణంగా అనుభవించాడని ,శారీరకంగా ఆకలితో, నైతికంగా సైతాను పరీక్షలతో ,“మన జీవిత ప్రయాణంలో మనం ఎదుర్కొనే పోరాటాన్నే ప్రభువు అనుభవించాడు,” అని పోప్ లియో అన్నారు.

అయితే, “సైతానుని ప్రతిఘటించడం ద్వారా మనం మోసాలను మరియు ఉచ్చులను జయించగలమని పోప్ స్పష్టం చేశారు.

ఈ సువార్త ఘట్టాన్ని ధ్యానిస్తూ, తపస్సు కాలం “వెలుగు మార్గం”గా పోప్ వివరించారు — తిరుసభ ప్రార్థనా క్రమం ద్వారా విశ్వాసులకు అందించబడిన ఒక కృపాకాలంగా వర్ణించారు

“ప్రార్థన, ఉపవాసం మరియు దానధర్మాల ఈ కృపాకాలంలో అత్యవసరం అని పోప్ అన్నారు 

అవసరం లేని వాటిని త్యజించి, దాచిన ధనాన్ని అవసరమైనవారితో పంచుకోవాలని ఆయన సూచించారు. ఈ విధంగా సమర్పణతో చేసే ప్రార్థన పరలోకానికి ఎగసి అంతరంగ శాంతిని ప్రసాదిస్తుందని అగస్తీను బోధనను పోప్ స్మరించారు

చివరిగా, తపస్సు కాల ప్రయాణాన్ని మరియతల్లికి అప్పగిస్తూ పోప్ తన సందేశాన్ని ముగించారు.