సోదరప్రేమను చాటిన సెయింట్ మేరీస్ మఠకన్యలు

జనవరి 28 మరియు జనవరి 30 తేదీలలో ప్రయాగ్‌రాజ్ లో మహాకుంభ్ కు హాజరైన భక్తులకు సెయింట్ మేరీస్ కాన్వెంట్ మఠకన్యలు, ఇంటర్ కళాశాల సిబ్బంది ఆహారం మరియు నీటిని పంపిణీ చేసి సోదర ప్రేమను చాటారు 

ఈ బృందం అంకితభావంతో చేసిన సేవ కార్యక్రమానికి లెక్కలేనంతమంది యాత్రికులు  ఆహారం మరియు ఉపాహారాన్ని అందుకున్నారు.

వారి నిస్వార్థ సేవా ప్రయత్నాలు, ఆతిథ్యం మరియు సమాజ సంక్షేమం ఇతరులకు నిజమైన స్ఫూర్తిని చాటుతుంది.

ఈ కళాశాల సిస్టర్స్ మరియు సిబ్బంది చూపిన దాతృత్వం మరియు శ్రద్ధకు యాత్రికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.

ఈ పంపిణీ విజయం సెయింట్ మేరీస్ కాన్వెంట్ ఇంటర్ కాలేజ్ సామాజిక బాధ్యత మరియు సేవ పట్ల నిబద్ధతను చాటుతూ, సమాజంలో ఐక్యత మరియు సోదర భావాన్ని పెంపొందించడంలో కరుణ శక్తిని బలోపేతం చేసింది.