శ్రీకాకుళం మేత్రాసనం, క్రైస్తవ సమైక్యత కార్యక్రమం

జగత్ గురువుల పిలుపు మేరకు జనవరి 18 నుండి 25, 2024 వరకు క్రైస్తవ సమైక్యత వారాన్ని శ్రీకాకుళం మేత్రాసనములో ఘనంగా నిర్వహించారు.

ప్రాంతీయ కథోలిక క్రైస్తవ శ్రీసభ సమైక్య మండలి ఆధ్వర్యంలో శ్రీకాకుళం మేత్రాసనం, మరియగిరి పాస్టరల్ సెంటర్ లో జనవరి 18 న మోన్సిగ్నోర్ బి బాలపుష్పరాజ్, మోన్సిగ్నోర్ దూసి దేవరాజ్, గురుశ్రీ కే అంతయ్య గార్ల సమక్షంలో నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం పీఠాధిపతులు మహా పూజ్య రాయరాలా విజయకుమార్ గారు క్రైస్తవ సంఘాల మధ్య ఉండవలసిన అంశాల గురించి ఆహ్వానితులకు తెలియచేసారు.

పార్వతీపురం మన్యం జిల్లా , శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల నుండి గురువులు,మఠకన్యలు  పాస్టర్లు, ఉపదేశులు, భక్తసంఘాలు ప్రతినిధులు మరియు యువతీయువకులు పాల్గొన్నారు 

Telugu Survey Popup Image