శాంతి మరియు సర్వమత సామరస్యంపై పాకిస్తాన్లోని క్రిస్టియన్ స్టడీ సెంటర్ వారి వర్క్షాప్
![](/sites/default/files/styles/max_width_770px/public/2024-04/pak_tmbnil_0.jpg?itok=gzKS_227)
Christian Study Centre (CSC), ఎక్యుమెనికల్ ఇన్స్టిట్యూట్, పాకిస్తాన్లోని జరన్వాలా నుండి క్రైస్తవ మరియు ముస్లిం యువ నాయకుల బృందంతో శాంతి మరియు సర్వమత సామరస్యంపై నాలుగు రోజుల శిక్షణా వర్క్షాప్ నిర్వహించింది.
ఈ బృందంలో విశ్వవిద్యాలయం మరియు కళాశాల విద్యార్థులు, అలాగే వివిధ మత సంస్థల ప్రతినిధులు ఉన్నారు.
సామాజిక ఐక్యత, క్రైస్తవం మరియు ఇస్లాంలో శాంతి మరియు సర్వమత సామరస్య భావన మరియు శాంతి మరియు మత స్వేచ్ఛను ప్రోత్సహించడంలో యువత పాత్ర వంటి అంశాలపై యువత జ్ఞానాన్ని మెరుగుపరచడం ఈ శిక్షణ లక్ష్యం.
ఇది శాంతి నిర్మాణం మరియు సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలను అందించడానికి మరియు మెరుగుపరచడానికి కూడా దోహదపడింది అని శిక్షణలో పాల్గొన్న వారు అన్నారు.
చర్చ్ ఆఫ్ పాకిస్థాన్లో ప్రొటెస్టంట్ బిషప్ అయిన శామ్యూల్ స్యామి రాబర్ట్ అజారియా, గురుశ్రీ బోనీ మెండిస్, డాక్టర్ అస్లాం ఖాకీ, మిస్టర్ రిజ్వాన్ అలీ ఖాన్, మరియు శ్రీ బసీర్ నయ్యర్ గార్లు ముఖ్య వ్యాఖ్యాతలుగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు.
CSC శిక్షణ వర్క్షాప్లో భాగంగా కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ, ఇస్లామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ కమీషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ మరియు హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆఫ్ పాకిస్తాన్లకు ఓరియంటేషన్ సందర్శనను కూడా నిర్వహించింది. ఈ సందర్శనల సమయంలో, ఈ సంస్థల పనితీరు మరియు ప్రభావం గురించి జరన్వాలాలోని యువతకు తెలియజేయడానికి బ్రీఫింగ్లు సహాయపడ్డాయి.
1967లో, క్రైస్తవ అధ్యయన కేంద్రం ప్రారంభం నుండి క్రైస్తవ సంప్రదాయం బలంగా పాతుకుపోయింది.
Article by: Bandi Arvind
Online Content Producer