మిన్నియాపాలిస్‌లో కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేసిన పోప్ లియో

అమెరికా Minneapolisలోని అనౌన్సియేషన్ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణనష్టం మరియు గాయాల గురించి తెలుసుకున్న పోప్ లియో XIV తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

Minneapolis అగ్రపీఠాధిపతులు Bernard Hebdaకు పంపిన టెలిగ్రామ్‌లో,ఈ  విషాదం వల్ల ప్రభావితమైన వారందరికీ, ముఖ్యంగా దుఃఖిస్తున్న కుటుంబాలకు తన హృదయపూర్వక సంతాపాన్ని మరియు ఆధ్యాత్మిక సాన్నిహిత్యాన్ని హామీ ఇస్తున్నట్లు" వ్యక్తం చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు ఈ దాడి జరిగింది. 

కాల్పులు జరిగిన కొన్ని గంటల తర్వాత, 8 మరియు 10 సంవత్సరాల వయస్సు గల కనీసం ఇద్దరు పిల్లలు మరణించారని, మరో 17 మంది గాయపడ్డారని, వారిలో 14 మంది పిల్లలులో  ఏడుగురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు నివేదించారు. 

పాఠశాల సముదాయంలోని ప్రార్థనా మందిరం లోపల పిల్లలు ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేస్తున్న కిటికీల గుండా కాల్పులు జరిపిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Telugu Survey Popup Image