మాడ్రిడ్‌కు చెందిన గురువిద్యార్థులతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

మాడ్రిడ్‌కు చెందిన గురువిద్యార్థుల
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

మాడ్రిడ్‌కు చెందిన గురువిద్యార్థులతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సమావేశమయ్యారు. ఆయన వారి కోసం సిద్ధం చేసిన సందేశాన్ని చదవలేదు, సాధారణంగా తనను  సందర్శించడానికి వచ్చే ప్రతి గురు విద్యార్థుల సంఘాలతో చేసే విధంగా ప్రశ్నలు మరియు ఆందోళనలకు సమాధానమిచ్చేందుకు దాదాపు రెండు గంటలు గడిపారు.

ఈనాటి యువకులను ఎలా సంప్రదించాలి, ఎందుకంటే వారు తరచుగా సమాచారంతో దూసుకుపోతున్నారు మరియు మొత్తం సమాచారంలో మరొక ధాతువుగా ఉండకుండా యేసు సందేశాన్ని ఎలా తీసుకురావాలో నేను ఆయనను అడిగే అదృష్టం కలిగింది. ఇందులో గురువిద్యార్థుల ఆందోళనలు కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన  ప్రార్థన మరియు సాక్ష్యముతో చాలా అనుసంధానించబడ్డాడు, మన జీవితం మనం జీవించే దానికి అనుగుణంగా ఉండాలి అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని కలిసిన ఆంటోనియో అనే ఒక గురువిద్యార్థి అన్నారు.

వారితో పాటు వారి సెంటర్ రెక్టార్ మరియు మాడ్రిడ్ అగ్రపీఠాధిపతి కూడా ఉన్నారు. కార్డినల్ మహా పూజ్య కోబో గారు గురువిద్యార్ధులతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క సాన్నిహిత్యాన్ని గుర్తు చేసారు మరియు పాపు గారు తన స్వంత అనుభవాలను గురించి కూడా చెప్పారని అన్నారు.

ఆయన మా హృదయాలను తెరిచారు. ఎందుకంటే తన జీవితం గురించి, తన గురుత్వ జీవితాన్ని ఎలా ప్రారంభించాడు అనే దాని గురించి మాకు చెప్పారు. కాబట్టి, ఇది మాకు చాలా హత్తుకునే క్షణం అని కార్డినల్ మహా పూజ్య కోబో గారు చెప్పారు.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారితో సమావేశమైన వారందరికీ ఇది ఒక చిరస్మరణీయమైన క్షణం. సెమినరీ రెక్టార్ సమావేశానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆనంద భాష్పాలతో కన్నీటి పర్యంతమైయ్యారు.