మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత
మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత
ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఒక తాజా దాడిలో, క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్న కుకీ గిరిజన సమూహానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హతమయ్యారు. ఈ ఘటన ఆయా వర్గాలలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.
మే 13న జరిగిన ఈ తుపాకీ దాడిలో మృతులలో బాప్టిస్ట్ చర్చికి చెందిన ముగ్గురు నాయకులు, ఉన్నారని, మరో నలుగురు గాయపడ్డారని స్థానిక వర్గాలు తెలిసింది.
కాంగ్పోక్పి జిల్లాలో జరిగీన ఈ ఘటనలో థాడో బాప్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (TBAI) మరియు యునైటెడ్ బాప్టిస్ట్ కౌన్సిల్ (UBC) సభ్యులు మరణించారు. చురాచంద్పూర్లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమం నుండి కాంగ్పోక్పికి తిరిగి వస్తున్న వారిపై గుర్తు తెలియని సాయుధులు దాడి చేసారు.
మే 2023 నుండి జరుగుతున్న జాతి సంఘర్షణల కారణంగా మణిపూర్లో 250 మందికి పైగా మరణించారు, అలాగే వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.చర్చిలపై దాడులు: హింసాత్మక ఘటనల్లో గిరిజన మరియు క్రైస్తవ వర్గాల ప్రార్థనా స్థలాలు, చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి.
Article and Design By M kranthi Swaroop