పేద ప్రజల కోసం అంకితమైన జీవితం | ఫాదర్ అగస్టో కొలంబో

వరంగల్‌లోని ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (FCIMS), మెడికేర్ జనరల్ హాస్పిటల్‌లో ఫాదర్ అగస్టో కొలంబో, PIME గారిని స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు.

పేద ప్రజల కోసం అంకితమైన జీవితం | ఫాదర్ అగస్టో కొలంబో

వరంగల్‌లోని ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (FCIMS), మెడికేర్ జనరల్ హాస్పిటల్‌లో ఫాదర్ అగస్టో కొలంబో, PIME గారిని స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు ఆయన అందించిన విశేష సేవలను కొనియాడారు. సమాజంలోని నిరుపేదలు, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(FCIMS) డైరెక్టర్ ఫాదర్ జి. చిన్నప్పురెడ్డి గారు తన సిబ్బందితో కలిసి ఫాదర్ అగస్టో కొలంబో గారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ పి. సంజయ్, నర్సింగ్ సూపరింటెండెంట్ సిస్టర్ మమత జె.ఎం.జె. తదితరులు పాల్గొని, ఫాదర్ కొలంబో గారు పేద ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు.

ఫాదర్ జి. చిన్నప్పురెడ్డి గారు మాట్లాడుతూ ఫాదర్ అగస్టో కొలంబో గారు "పేదల కోసం పరితపించారు అని, నిరుపేదల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సేవకులు” అని అన్నారు.

ఫాదర్ అగస్టో కొలంబో 1927 మార్చి 15న ఇటలీలోని కొమో ప్రావిన్స్‌లో ఉన్న కాంటూ గ్రామంలో జన్మించారు. 1944లో ఆయన PIME (పొంటిఫికల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫారిన్ మిషన్స్) సెమినరీలో చేరి గురువుగా శిక్షణ పొంది, గురువు గా పట్టా అందుకున్నారు.

1952లో ఆయన భారతదేశానికి వచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రా ప్రాంతంలో (వరంగల్, కరీంనగర్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలు) తన మిషనరీ సేవలను ప్రారంభించారు. దాదాపు 60 ఏళ్లపాటు ఆయన ఇక్కడే ఉంటూ సమాజ సేవ చేశారు.

ఫాదర్ కొలంబో ముఖ్యంగా పేదలు, దళితులు మరియు అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేశారు.పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి అనేక పాఠశాలలు, హాస్టళ్లు మరియు ఇంజనీరింగ్/సాంకేతిక కళాశాలలను స్థాపించారు.గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కోసం ఆసుపత్రులు మరియు దవాఖానలను నిర్మించారు.గ్రామీణ ప్రాంతాల్లో బావులు తవ్వించడం, తాగునీటి సదుపాయాలు కల్పించడం మరియు రైతులకు తోడ్పాటు అందించడంలో కీలక పాత్ర పోషించారు.

ఫాదర్ అగస్టో కొలంబో గారు 2009 ఆగస్టు 29న తమ 82వ ఏట వరంగల్‌లో పరమపదించారు. ఆయన అంతిమ యాత్రకు వేలాది మంది ప్రజలు హాజరై తమ అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. పేదల నిమిత్తం ఆయన చేసిన నిరంతర సేవలకు గాను ఆయనను ఈ ప్రాంతంలో ఒక మహానాయకుడిగా, కరుణామూర్తిగా గుర్తుంచుకుంటారు.

Article and Design By M Kranthi Swaroop

 

Telugu Survey Popup Image