వరంగల్ నూతన పీఠాధిపతిగా మహా పూజ్య దుగ్గింపుడి విజయపాల్ గారు
వరంగల్ నూతన పీఠాధిపతిగా మహా పూజ్య దుగ్గింపుడి విజయపాల్ గారు
వరంగల్ నూతన పీఠాధిపతిగా మహా పూజ్య మోన్సిన్యూర్ దుగ్గింపుడి విజయపాల్ గారు నియమితులయ్యారు. పునీత తోమాసు గారి పండుగ రోజున , అనగా జూలై 3, 2026 న వీరి అభిషేక మరియు ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ మహోత్సవం వరంగల్ లోని ఫాతిమా బృహదేవాలయ ప్రాంగణంలో నిర్వహించారు.
పవిత్ర మహోత్సవంలో హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య కార్డినల్ పూల అంతోని గారు ప్రధాన అభిషేకకర్త గా , విశాఖ అతిమేత్రాసన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఉడుమల బాల గారు సహ-అభిషేకకర్త గా , శ్రీకాకుళం మేత్రాసన పీఠాధిపతులు రాయరాల విజయకుమార్ సహ-అభిషేకకర్త గా పాల్గొన్నారు.
ఏలూరు పీఠాధిపతి మహా పూజ్య పొలిమేర జయరావు గారు ఈ పవిత్ర మహోత్సవంలో పాల్గొని అమూల్యమైన దైవసందేశాని అందించారు.
తెలుగు రాష్ట్రాలలోని పలువురు గురువులు, కన్యాస్త్రీలు మరియు వేలాదిమంది విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వరంగల్లు మేత్రాసనానికి 13 నెలల పాటు అడ్మినిస్ట్రేటర్గా సేవలందించిన మోన్సిగ్నోర్ దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి గారు, అదే మేత్రాసనానికి నాలుగవ పీఠాధిపతిగా (బిషప్గా) పరిశుద్ధ పోపు గారిచే ఎంపికయ్యారు. ఒక అడ్మినిస్ట్రేటర్ నేరుగా పీఠాధిపతులుగా ఎన్నిక కావడం మన తెలుగు శ్రీసభ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి.
Article and Design By M Kranthi Swaroop