ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డును అందుకున్న గురుశ్రీ సూసై అంతోని

ఆగస్టు 15న తమిళనాడు ప్రభుత్వం గురుశ్రీ సూసై అంతోని గారికి "ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డును" ప్రకటించింది.


తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్.కె. స్టాలిన్ గారు ఈ అవార్డును గురుశ్రీ సూసై గారికి అందచేశారు.

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో మానసిక వ్యాధితో బాధపడుతున్న వారకై స్థాపించిన గృహం -MANASU

మానసు డైరెక్టర్ గురుశ్రీ సూసై అంతోని గారు. వీరు క్లరేసియన్ సభ గురువులు 

ఫాదర్ గారుసోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీ పొందారు మరియు క్లరేసియన్ లైఫ్ యానిమేషన్ ప్రాజెక్ట్ (CLAP) ట్రస్ట్ కు డైరెక్టర్ గా కూడా ఉన్నారు.

మానసు ఒక మానసిక ఆరోగ్య దాతృత్వ గృహం, క్లాప్ యూనిట్.

మానసిక వ్యాధితో బాధపడుతున్న మనిషిని రక్షించడం, బాధలనుండి కోలుకునేలాగా చేయడం,పునరావాసం కల్పించడం కోసం ఫాదర్ సూసై గారు తన సేవను అంకితం చేసారు.
 

Tags