ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమాన్ని సందర్శించనున్న పోప్
జూన్ 22న ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) ప్రధాన కార్యాలయాన్ని పోప్ లియో సందర్శించనున్నారని పోప్ గృహ వ్యవహారాల ప్రిఫెక్చర్ తెలిపింది.
"ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆహ్వానాన్ని అంగీకరిస్తూ, కార్యనిర్వాహక మండలి వార్షిక సమావేశంలో పాల్గొనేవారిని, సిబ్బందిని మరియు వారి కుటుంబాలను కలవడానికి జూన్ 22, సోమవారం నాడు రోమ్ లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పోప్ సందర్శించనున్నారు
పోప్ గృహ వ్యవహారాల ప్రిఫెక్చర్ జారీ చేసిన ఒక ప్రకటనను ప్రచురిస్తూ, హోలీ సీ ప్రెస్ ఆఫీస్ జూన్ 16, 2026, మంగళవారం నాడు ఈ పర్యటనను ప్రకటించింది.
గత నెలలో, పోప్ లియో మే మాస ప్రార్థన ఉద్దేశం ప్రతి ఒక్కరికీ ఆహారం లభించాలని ప్రకటించగా.
ఈ ఉద్దేశం కోసం ప్రార్థించాలని, కృషి చేయాలని ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కతోలికులను ఆహ్వానించారు.
అదే సమయంలో, ఎంతో ఆహారం వృధా అవుతుండగా, లక్షలాది మంది ఆకలితో బాధపడుతూనే ఉన్నారని పోప్ వ్యక్తం చేసారు
ప్రపంచ ఆహార కార్యక్రమం (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్) 2026 గ్లోబల్ అవుట్లుక్ ప్రకారం, ఈ సంవత్సరం 31.8 కోట్ల మంది ప్రజలు ఆహార సంక్షోభాలను లేదా అంతకంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటారు.
మధ్యప్రాచ్యంలోని సంఘర్షణ కారణంగా ఈ సంవత్సరం మధ్యకాలానికి ముందే అదనంగా 4.5 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.
ప్రపంచ ఆహార దినోత్సవాన్ని మరియు ఆ సంస్థ స్థాపించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పోప్ లియో అక్టోబర్ 16, 2025న ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.
FAOలో తన ప్రసంగంలో, ఆయన ఆ సంస్థ పట్ల హోలీ సీ యొక్క సాన్నిహిత్యాన్ని పునరుద్ఘాటించారు మరియు ఆకలి, పోషకాహార లోపాన్ని అంతం చేయడానికి ఉమ్మడి ప్రపంచ నిబద్ధత కొరకు పిలుపునిచ్చారు.