సూడాన్ గణతంత్ర ప్రధానమంత్రిని కలిసిన పోప్ లియో

వాటికన్‌లో సోమవారం మే 11 ఉదయం సూడాన్ గణతంత్ర ప్రధానమంత్రి Kamil El-Tayeb Idris Abdelhafizను పోప్ లియో కలిసారు.

పోప్ తో సమావేశం అనంతరం ప్రధానమంత్రి, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్ మరియు దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల ఉప కార్యదర్శి మాన్సిగ్నోర్ మిహైటా బ్లాజ్‌లతో విదేశాంగ సచివాలయంలో సమావేశమయ్యారు.

పోప్ సీ పత్రికా కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, విదేశాంగ సచివాలయంలో జరిగిన సంభాషణలు సౌహార్దపూర్వకంగా జరిగాయి మరియు వాటికన్, సూడాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అంగీకరించబడ్డాయి  

దేశ శ్రేయస్సు కోసం స్థానిక శ్రీసభ చేస్తున్న గణనీయమైన కృషి మరియు గత మూడేళ్లుగా యుద్ధంతో దెబ్బతిన్న సూడాన్‌ను పట్టిపీడిస్తున్న సంక్షోభంపై చర్చలు కేంద్రీకరించబడ్డాయని ఆ ప్రకటన పేర్కొంది.

ఈ విషయంలో, "సంఘర్షణను అంతం చేసి, సమిష్టిగా శాంతిని నెలకొల్పే లక్ష్యంతో, కాల్పుల విరమణ సాధించడం, ప్రజలకు సహాయం అందించడం మరియు సూడాన్ దేశంలోని అన్ని పక్షాల మధ్య నిజాయితీతో కూడిన సంభాషణను ప్రారంభించడం అత్యవసరం" అని పునరుద్ఘాటించినట్లు ఆ ప్రకటన పేర్కొంది