ద్రాక్షారామంలో ఘనంగా జాతీయ యువతా దినోత్సవం

ద్రాక్షారామంలో ఘనంగా జాతీయ యువతా దినోత్సవం

విశాఖ అతిమేత్రాసనం ద్రాక్షారామం విచారణలో జాతీయ యువతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విచారణ కర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

సుమారు 60  మంది విచారణ యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలలో యువతీ యువకుల కోసం ప్రత్యేక ఆరాధనను నిర్వహించారు. గురుశ్రీ వి. బాలరాజు గారు ఆరాధనను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి శాంతి సాధన పాఠశాల కరస్పాండెంట్ గురుశ్రీ  హ్యారి ఫిలిప్స్ గారు ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు. గురుశ్రీ  హ్యారి ఫిలిప్స్ గారు మాట్లాడుతూ శ్రీ సభకి యువత వెన్నుముక్క లాంటి వాళ్ళు అని, చిన్ననాటి నుండే ప్రభు యేసుని మార్గంలో నడవాలని కోరారు.

యువతీ యువకుల కొరకు ప్రత్యేక కార్యక్రమాలను విచారణ గురువులు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారు మరియు విచారణ సహాయక గురువులు గురుశ్రీ విమల్ రాజ్ గారు ఏర్పాటు చేసారు. వీటిలో భాగంగా ఆటలపోటీలు , వివిధ సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

విచారణ గురువులు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారు అందరికి ప్రేమ విందును ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం విజయవతంగా జరగడానికి సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి  గురుశ్రీ ప్రభాకర్ గారు కృతజ్ఞతలు తెలియచేసారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer