ఘనంగా వేపాడ విచారణలో పిల్లల మరియు యువత శిబిరం

ఘనంగా వేపాడ విచారణలో పిల్లల మరియు యువత శిబిరం

విశాఖ అతిమేత్రాసనం వేపాడ విచారణలో పిల్లల శిబిరం ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ బి బాలరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

అక్టోబర్ 13,2024  న జరిగీన ఈ కార్యక్రమంలో విచారణ పిల్లలు మరియు యువతీ యువకులు పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు జరిగింది.

ఈ కార్యక్రమంలో గురుశ్రీ ఆనంద్ గారు పాల్గొని సోషల్ మీడియా మరియు యువత అనే అంశంపై మాట్లాడారు. గురుశ్రీ బి బాలరాజు గారు పిల్లలను మరియు యువతను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తూ ఒకరితో ఒకరు కోపం, కలతలు చెందకుండా ఎదుట వారితో  సత్సంబంధాలను కలిగివుండాలని కోరారు.

 పిల్లలు మరియు యువత కొరకు ఆటలపోటీలను ,వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి  గురుశ్రీ బి బాలరాజు గారు కృతజ్ఞతలు తెలిపారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer