ఘనంగా ద్రాక్షారామం విచారణలో పిల్లల శిబిరం

ఘనంగా ద్రాక్షారామం విచారణలో పిల్లల శిబిరం

విశాఖ అతిమేత్రాసనం ద్రాక్షారామం విచారణలో పిల్లల శిబిరం ఘనంగా నిర్వహించారు. విచారణ కర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ శిబిరం పిల్లలకు నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేలా సాగింది. రాజమండ్రి విచారణ  సహాయక గురువులు గురుశ్రీ  కె. ప్రభాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు వివిధ విషయాలను బోధించారు, యువతకు ప్రేరణాత్మక వీడియోలను చూపించారు, పిల్లల కోసం అనేక ఆటల పోటీలను కూడా నిర్వహించారు.

దాదాపు 115 మంది పిల్లలు ఈ సమావేశానికి హాజరయ్యారు.  ద్రాక్షారామం విచారణ సహాయక గురువులు గురుశ్రీ విమల్ రాజ్ గారు, కనొస కాన్వెంట్ - కనోషియన్ డాక్టర్స్ సోషల్ సర్వీస్ సొసైటీ ఇంచార్జ్ సుపీరియర్ సిస్టర్ దీప గారు మరియు విచారణ యువత ఈ కార్యక్రమానికి సహకరించారు.

విచారణ గురువులు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారు ఈ కార్యక్రమం విజయవతంగా జరగడానికి సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి  హృదయపూర్వక  కృతజ్ఞతలు తెలియచేసారు.


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer