ఖమ్మం మేత్రాసనంలో ఘనంగా సంగీత తరగతులు
ఖమ్మం మేత్రాసనంలో ఘనంగా సంగీత తరగతులు
ఖమ్మం మేత్రాసనం, నాయుడుపేట లో సంగీత తరగతులు పాస్త్రోల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ శ్రీ కాకుమాను రాజు గారి పర్యవేక్షణలో ఘనంగా జరిగాయి.
మేత్రాసనములోని వివిధ విచారణల నుండి బాల బాలికలు ఎంతో మంది ఈ సంగీత తరగతులలో పాల్గొన్నారు. పిల్లలకు అపార అనుభవం కలిగిన గురువులచే శిక్షణ ఇచ్చారు. చాలా మంది నేర్చుకుని అద్భుతంగా ప్లే చేయగలిగారు. పాస్ట్రాల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ కాకుమాను రాజు గారి ఆధ్వర్యంలో మే నెల అంతా కూడా క్లాస్ లు జరిగాయి.
చివరి రోజు ఖమ్మం పీఠాధిపతులు మహా పూజ్య డా. ప్రకాష్ గారు పాల్గొని పిల్లలను అభినందించారు.
ఫాదర్ శ్రీ కాకుమాను రాజు మాట్లాడుతూ "సంగీతం నేర్చుకోవడం వల్ల పిల్లలలో సృజనాత్మకతను మెరుగుపరచడంతో పాటు, ఏకాగ్రత, సమన్వయం, సహనం మరియు ఆత్మవిశ్వాసం వంటి అనేక నైపుణ్యాలను పెంపొందిస్తుంది" అని అన్నారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer