వరద బాధితులకు అండగా CMF గురువులు

వరద బాధితులకు అండగా CMF గురువులు

గుంటూరు మేత్రాసనం, భట్టిప్రోలు విచారణ, జువ్వలపాలెం గ్రామంలో వరద బాధితులకు  క్లారెటియన్ సంస్థ గురువులు (CMF) నిత్యావసర సరుకులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గురుశ్రీ తుమ్మ జయ పాల్ రెడ్డి CMF, గురుశ్రీ కొమ్మరెడ్డి రవికుమార్ CMF, గురుశ్రీ T మార్టిన్ CMF గార్లు పాల్గొన్నారు.  వరద బాధితులకు అండగా ప్రభు యేసుని ప్రేమను తెలియజేస్తూ వరద బాధితుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు.

కృష్ణా నది వరదలకు లంక గ్రామాలు అతలాకుతలమయ్యాయి. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో ప్రస్తుతానికి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ నేటికీ అనేక గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. కొల్లూరు మండలంలో కలవానిపాలెం క్రీస్తులంక, తడికలపూడి, జువ్వలపాలెం గ్రామాలు దెబ్బతిన్నాయి.

 

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer