భక్తియుతంగా పవిత్రాత్మ అభిషేక కూటములు

భక్తియుతంగా పవిత్రాత్మ అభిషేక కూటములు

ఏలూరు మేత్రాసనం, బొర్రపాలెం లో పవిత్రాత్మ కాథోలిక విచారణ దేవాలయంలో ప్రత్యేక తపస్సు కాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.విచారణ కర్తలు ఫాదర్ బి విజయ్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఏప్రిల్ 5,6,7 తేదీలలో పవిత్రాత్మ అభిషేక కూటములు నిర్వహించారు.ఈ ప్రత్యేక ప్రార్థనలను బ్రదర్ సత్యం వాడపల్లి గారు నిర్వహించారు.    

ఈ ప్రార్థన కూటమి లో అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు. బ్రదర్ సత్యం వాడపల్లి గారు  దైవ సందేశాన్ని అందించి  విశ్వాసులను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్లారు. అనంతరం విశ్వాసులకొరకు ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు."ఈ తపస్సు కాలంలో మారుమనస్సు పొంది ప్రభు యేసుని మార్గంలో నడవాలని, ప్రభు యేసుని ప్రేమ,కరుణ, జాలి కలిగి జీవించాలని  బ్రదర్ సత్యం గారు ప్రజలను కోరారు.   

విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. విచారణ ప్రజలు ,సిస్టర్స్,  లీజన్ మేరీ  సభ్యులు, యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు. ప్రార్థన కూటమికి సహాయపడిన ప్రతి ఒక్కరిని విచారణ కర్తలు  ఫాదర్ బి విజయ్ ప్రసాద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer