భక్తియుతంగా తపస్సు కాల ప్రార్థనలు

భక్తియుతంగా  తపస్సు కాల ప్రార్థనలు

విశాఖ అతిమేత్రాసనం వెంకోజీపాలెం విచారణ  ఆరోగ్యమాత  దేవాలయంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాల ప్రార్థన కూటమి. మార్చి 3వ తేది  సాయంత్రం 6 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు.   

ఈ తపస్సు కాల ప్రార్థనలు ఆరోగ్యమాత దేవాలయ విచారణ కర్తలు  గురుశ్రీ ఎస్ పీటర్  గారి  ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన తపస్సు కాల ప్రార్థనలలో  విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, కోడూరుమాత పుణ్య క్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ  పసుపులేటి యుగళ్ కుమార్ గారు పాల్గొని చక్కటి దైవసందేశాని ప్రజలకు అందించారు.  

జ్ఞానాపురంకు చెందిన శ్రీ  కసిరెడ్డి చిన్నారావు మాష్టారు గారు చక్కని సంగీతంను అందించగా  విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. PPC కార్యవర్గం. సొడాలిటి, లీజన్ మేరీ  సభ్యులు, యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు. ప్రార్థన కూటమికి సహాయపడిన ప్రతి ఒక్కరిని విచారణ కర్తలు  గురుశ్రీ ఎస్ పీటర్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

 

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer