భక్తియుతంగా ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన

భక్తియుతంగా ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన

విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ స్వస్థత ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది. ఈ ప్రార్థన కూటమి సెప్టెంబర్ 18, బుధవారం  రాత్రి  పనసబద్ర నూతన దేవాలయంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది.

విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, యర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది.
ఈ ప్రార్థన సమావేశంలో  మన ప్రపంచం కోసం, మనకు అసాధ్యమవుతున్న మన సమస్యల పరిష్కారం మరియు విడుదల కొరకు ప్రత్యేకించి ప్రార్ధించారు.

వాక్య పరిచర్యను  గురుశ్రీ శరగడం బాలశౌరి గారు మరియు గురుశ్రీ బి బాలరాజు గార్లు   నిర్వహించారు. పరిశుద్ద సిలువ మార్గం ధ్యానం అనంతరం దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ, దివ్య సత్ప్రసాద మహా ఆరాధనని భక్తియుతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గురువులు గురుశ్రీ బాలశౌరి, గురుశ్రీ బి బాలరాజు, గురుశ్రీ నరేష్ ,గురుశ్రీ సైమన్ , గురుశ్రీ రాయప్ప ,గురుశ్రీ జయరాజు గార్లు పాల్గొన్నారు. గురువులందరు సమిష్టి దివ్యబలి పూజని సమర్పించారు. గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక తైల అభిషేక స్వస్థత ప్రార్దనలును నిర్వహించారు.

విచారణ సిస్టర్స్, అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ యువత ఈ రాత్రి జాగరణ ప్రార్థనలో పాల్గొన్నారు. దేవాలయంలో పాప సంకీర్తనలు మరియు స్వస్థత ప్రార్దనలు నిర్వహించారు. విచారణ గాయకబృందం మధురమైన గీతాలను ఆలపించారు.

విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారు రాత్రి జాగరణ ప్రార్థనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer