పోప్ చికిత్సకు స్పందిస్తున్నారు కానీ ఇంకా ప్రమాదం నుండి బయటపడలేదన్న వైద్యులు.

విశ్వ కాపరి పోప్ ఫ్రాన్సిస్ ప్రమాదం నుంచి బయటపడలేదు కానీ,ఆయనకు ప్రాణాపాయం లేదని ఆయనకు చికిత్స చేస్తున్న రోమ్లోని గెమెల్లి ఆస్పత్రి వైద్య బృందం ఫిబ్రవరి 21 తెలిపింది.

వచ్చే వారమంతా ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని కూడా వైద్యులు స్పష్టం చేశారు.

రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో, పోప్‌ను చూసుకుంటున్న బృందం అధిపతి డాక్టర్ సెర్గియో అల్ఫియరీ మరియు వాటికన్ ఆరోగ్య సంరక్షణ సేవ వైస్-డైరెక్టర్ డాక్టర్ లుయిగి కార్బోన్, గది నిండా జర్నలిస్టులతో నలభై నిమిషాలు మాట్లాడారు.


బ్రాంకైటిస్, న్యుమోనియాతో తీవ్ర అనారోగ్యం బారిన పడిన పోప్ ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. శుక్రవారం మొదటిసారిగా పోప్ ఆరోగ్యంపై వారు స్పష్టత ఇచ్చారు.

'అప్పుడప్పుడూ ఆయనకు విటమిన్లు, మినరల్స్ తో కూడిన ఆక్సిజన్ను అందజేస్తున్నాం. న్యుమోనియా రెండు ఊపిరితిత్తుల్లోనూ ఉంది. దీని నివారణ వైద్య చికిత్సలకు ఆయన సరిగ్గానే స్పందిస్తున్నారు'అని గెమెల్లి ఆస్పత్రి వైద్య బృందం వివరించింది. 

శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్తోనూ ఆయన ఇబ్బంది పడుతున్నట్లు పరీక్షల్లో వెల్లడైందని వైద్యులు తెలిపారు .