పొంటిఫికల్ ప్రతినిధులతో సమావేశమైన జగద్గురువులు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపోస్టోలిక్ నున్సియోస్ మరియు ఇతర పాపల్ ప్రతినిధులను  మంగళవారం జూన్ 10 న వాటికన్‌లో పోప్ లియో కలిశారు.

ప్రతి ఒక్కరికీ పునీత పేతురు వారసత్వ బంధాన్ని సూచించే ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు, దానిపై "sub umbra Petri" అనే రాసి ఉంది.

పాపల్ ప్రతినిధులు, కథోలిక శ్రీసభ మరియు దాని సార్వత్రికతకు ప్రతిరూపమని పోప్ పేర్కొన్నారు  ఎందుకంటే వారు అనేక దేశాల నుండి వచ్చారు మరియు ప్రపంచవ్యాప్తంగా పోప్‌కు ప్రాతినిధ్యం వహించడానికి పంపబడ్డారు.

తన పరిచర్యలో మొదటి అడుగులు వేస్తున్న సమయంలో పోప్ లియో వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు, ఏదైనా దేశానికి సంబంధించిన సమస్యలు మరియు పరిస్థితులను అర్థం చేసుకోవడంలో వారి నైపుణ్యాన్ని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు.

Telugu Survey Popup Image