పెంతెకోస్తు మహోత్సవ జాగరణలో పాల్గొన్న పోప్

శనివారం జూన్ 7 సాయంత్రం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పెంతెకోస్తు మహోత్సవ జాగరణలో లియో పోప్ పాల్గొన్నారు.

సామాన్య సంఘాలు మరియు విశేష పరిచర్య ఉద్యమాల జూబ్లీ లో 100 కంటే ఎక్కువ దేశాల నుండి దాదాపు 70,000 మంది యాత్రికులు ఈ జాగరణలో పాల్గొన్నారు. 

సినడ్ ప్రాముఖ్యతను వివరిస్తూ , త్రిత్వైక దేవుడు మనతో ఎల్లపుడు ఉంటారని, ప్రస్తుత ప్రపంచం హింస మరియు విభజనకు భిన్నంగా పవిత్రాత్మ శక్తితో మనం అందరం మన ప్రయాణాలు కొనసాగించాలని పోప్ అన్నారు  

"మనమందరం ఒకటిగా జీవించడానికి దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు"  'సినడాలిటీ' అనేది శ్రీసభ ఐక్యతను వివరించడానికి ఉపయోగించే పదం అని పోప్ వివరించారు .