నూతన నియామకం

ఫ్రాన్సిస్ పాపు గారు డొమినికన్ సభకు చెందిన గురుశ్రీ నెపోలియన్ సిపాలే గారిని ఫిలిప్పీన్స్‌లోని అలమినోస్ మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా నియమించారు.

మేత్రాసనంలో నాలుగేళ్లు పీఠాధిపతి స్థానం ఖాళీగా ఉన్నందున జనవరి 28 2024 న ఆయన నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది.

ప్రస్తుతం తూగేగారావు అగ్రపీఠాధిపతులుగా సేవలందిస్తున్న మహా పూజ్య రికార్డో బాకే గారి తర్వాత  గురుశ్రీ నెపోలియన్ గారు బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఫిలిప్పీన్స్‌లోని ప్రావిన్స్  విశ్రాంత అగ్రపీఠాధిపతులు లియోనార్డో లెగాజ్‌పి ఆఫ్ కాసెరెస్ మరియు సహాయక పీఠాధిపతులు జోస్ సలాజర్ ఆఫ్ లిపాను గార్లు కూడా డొమినికన్ సభకు చెందిన వారే.

దక్షిణ ఫిలిప్పీన్స్‌కు చెందిన గురుశ్రీ సిపలే గారు అక్టోబర్ 20, 1970న దావో నగరంలో జన్మించారు. 

అతను 1988లో ఆర్డర్ ఆఫ్ ప్రీచర్స్‌లోకి ప్రవేశించి, 

1991లో తన మొదటి మాటపట్టు తీసుకున్నారు.

తను ఏప్రిల్ 5, 1997న గురువుగా అభిషేకింపబడ్డారు. 

శ్రీలంకలో మిషనరీగా తొమ్మిది సంవత్సరాలు వివిధ పదవులలో సేవలందించారు.

మనీలాలోని శాంటో టోమస్ విశ్వవిద్యాలయం (UST)లో సెయింట్ థామస్ అక్వినాస్ యొక్క ప్రియరీ సభ్యుడు మరియు UST సెంట్రల్ సెమినరీకి వైస్ రెక్టర్‌గా ప్రస్తుతం తన సేవలు అందిస్తున్నారు.

2016 నుండి 2021 వరకు ప్రియర్ ప్రొవిన్షియల్ పదవిని కూడా కలిగి ఉన్నాడు మరియు ఫిలిప్పీన్స్‌లోని డొమినికన్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ కౌన్సిల్ సభ్యునిగా కొనసాగుతున్నారు