త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం, క్రీడల జూబిలీని కొనియాడిన పోప్

త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం, క్రీడల జూబిలీని కొనియాడిన పోప్
జూన్ 15 ఆదివారం సెయింట్ పీటర్స్ బసిలికాలో పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం మరియు క్రీడా ఉత్సవం సందర్బంగా పోప్ లియో దివ్యబలిపూజను సమర్పించారు
ఆయన చేసిన పుడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని” (సామెతలు 8:22, 28, 30-31). పునీత అగస్టీను గారు చెప్పినట్లుగా, త్రిత్వం (తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ) మరియు విజ్ఞానం చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి.
దైవిక విజ్ఞానం పరిశుద్ధ త్రిత్వంలో వెల్లడైంది. ఈ విజ్ఞానం ఎల్లప్పుడూ మనలను సత్యం వైపు నడిపిస్తుంది.
మన జీవితంలో విజ్ఞానాన్ని అలవర్చుకోవడం ద్వారా మనం దైవ సన్నిధిలో ఆనందాన్ని పొందవచ్చు మరియు సత్య మార్గంలో నడవవచ్చు.
త్రిత్వం, క్రీడల కలయిక కొంత అసాధారణంగా అనిపించినా, ఈ రెండింటినీ పక్కపక్కన ఉంచడం అనవసరమైనదైతే కాదు అని పోప్ అన్నారు
ఈ దృక్పథం నుండి, క్రీడను, ఈ రోజుల్లో, మానవ మరియు క్రైస్తవ సద్గుణాలతో శిక్షణ పొందేందుకు ఒక విలువైన సాధనంగా మార్చే మూడు ప్రత్యేక విషయాలపై దృష్టి సారిద్దాం అని పోప్ అన్నారు .
మొదటిది, ఈ రోజుల్లో సమాజంలో ఒంటరితనం పెరిగిపోతోంది. తీవ్రమైన వ్యక్తిగతవాదం “మనము” అనే భావన నుండి “నేను” అనే దానిపై ఎక్కువ దృష్టి పెడుతుంది.
రెండవది, మనం ప్రస్తుతం డిజిటల్ సమాజంలో ఉన్నాం. సాంకేతికత దూరంగా ఉన్నవారిని దగ్గర చేసినప్పటికీ, భౌతికంగా దగ్గరగా ఉన్నవారి మధ్య తరచుగా దూరాన్ని పెంచుతుంది.
మూడవదిగా, ఈ పోటీ ప్రపంచంలో, బలవంతులు, విజేతలు మాత్రమే జీవించడానికి అర్హులు అన్నట్లు కనిపిస్తుంది. కానీ, క్రీడ మనకు ఓడిపోవడాన్ని కూడా నేర్పుతుంది అని పోప్ అన్నారు