ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
విశాఖ అతిమేత్రాసనం, రాజమండ్రి విచారణ , కొంతమూరు లోని జూబిలీ మెమోరియల్ RCM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ (Jubilee Memorial (R.C.M) English Medium High School ) నందు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలు స్కూల్ హెఅడ్మిస్ట్రేస్(Headmistress) సిస్టర్ జైసే మరియా FCC, గారి అధ్వర్యం లో జరిగాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా "హోలీ రెడీమేర్స్ దేవాలయ" విచారణ కర్తలు ఫాదర్ మనోజ్ కుమార్ గారు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ దేశభక్తిని చాటారు. జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్య రావడానికి అమరులైన పలువురు స్వతంత్ర సమరయోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించారు.
ఫాదర్ మనోజ్ కుమార్ గారు మాట్లాడుతూ " దేశం కోసం ఎంతోమంది వీరులు వారి ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసారని, త్యాగం చేసిన త్యాగమూర్తులను స్మరించుకోవడం మన బాధ్యత అని, ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమి చేయాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు.
పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు .విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Article and Design: M. Kranthi Swaroop