ఘనంగా ముగిసిన కర్నూలు మేత్రాసన మహా సభలు 2025

కర్నూలు మేత్రాసనం సినడ్ ని పురస్కరించుకుని మే 26 నుండి 30 వరకు జీవసుధా పాస్టరల్ సెంటర్ లో 2025 మహా సభలు ఘనంగా జరిగాయి 

కర్నూలు మేత్రాసన కాపరి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారి ఆధ్వర్యంలో ఈ సభలు జరిగాయి.

ఈ రోజు మహసభలో సభ్యులు మేత్రాసన ఆస్తుల గురించి, వాటిని ఎలా కాపాడుకోవాలని, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో సభ్యులు తమ సలహాలను, సూచలను చేశారు. 
మరియు అనేక లీగల్ విషయాలను గురించి కూడా చర్చించారు. 

మహాసభలో పాల్గొన్న విశ్వాసులు, మఠకన్యలు, గురువులు తమ ఆనందమును, సంతోషాన్ని తెలియపరిచారు. 

ఈ మహాసభల ద్వారా మేము అనేక విషయాలను తెలుసుకున్నామని, అనేకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

తరువాత పీఠాధిపతులు అన్ని విచారణల నుండి తరలివచ్చిన విశ్వాసులను మఠవాసులకు మరియు గురువులకు ప్రతి ఒక్కరకి కృతజ్ఞతలు తెలియపరిచారు.

నాలుగవ మరియు మహా సభల చివరిరోజైన మే ౩౦ న ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది