క్రీస్తుకు సాక్షులుగా నిలవాలని ప్రాచ్యశ్రీసభను కోరిన పోప్

రోమ్లో జూన్ 26 గురువారం Reunion of Aid Agencies for the Oriental Churches (ROACO) వార్షిక సమావేశములో పాల్గొన్న వారితో పోప్ లియో సమావేశమయ్యారు.
విశ్వాసులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక మద్దతు అందించడంలో ప్రాచ్య క్రైస్తవ సంఘాలు చేస్తున్న కృషికి వారిని పొప్ ప్రసంశించారు.
ఇటీవలి సంవత్సరాలలో యుద్ధాలు, ద్వేషంతో నాశనమైన తూర్పు దేశాలలో నిరీక్షణ బీజాలను నాటినందుకు క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు మరియు దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ద్వేషం అనే చీకటి నీడల మధ్య వెలుగుగా ప్రకాశించారని ప్రాచ్య క్రైస్తవ సంఘాలను పొప్ ప్రశంసించారు
మధ్యప్రాచ్యంలో జరిగిన సంఘర్షణ కారణంగా ROACO సభ్యులు వార్షిక సమావేశానికి రోమ్కు రాలేకపోయారని పోప్ పేర్కొన్నారు
"ఉక్రెయిన్, గాజాలో విషాదకరమైన మరియు అమానవీయ పరిస్థితి మరియు యుద్ధం వ్యాప్తితో నాశనమైన మధ్యప్రాచ్యం గురించి ఆలోచించినప్పుడు నాకు ఎంతో భాదాకలుగుతుంది" అని ఆయన అన్నారు.
ప్రతి వ్యక్తి, ఈ సంఘర్షణలకు కారణాలను పరిశీలించి, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి, అదే సమయంలో మోసపూరితమైన లేదా తప్పుడు వివరణలను తిరస్కరించాలి అని పోప్ అన్నారు.