ఏలూరు పీఠాధిపతుల 11 వ పీఠాధిపత్య వార్షికోత్సవ వేడుకలు.

జులై 25 ,2024 న ఉదయం 6:30 గంటలకు ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య పొలిమెర జయరావు గారి 11 వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని ఏలూరు మేత్రాసనంలో కార్మెల్ ఆశ్రమంలో ఘనంగా కొనియాడారు.

ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య పొలిమెర జయరావు ,ఖమ్మం పీఠాధిపతులు మహా పూజ్య సగిలి ప్రకాష్ గార్లను సాదరముగా ఆహ్వానించారు. అనంతరం పీఠాధిపతులవారు 11 వ పీఠాధిపత్య వార్షికోత్సవ కృతజ్ఞతా దివ్యబలి పూజను సమర్పించారు.

ఖమ్మం మేత్రానులు పునీత యాకోబు గారి మహోత్సవాన్ని పురస్కరించుకొని " దేవుని సేవకై ఎన్నుకోబడిన వారు, దేవుని యొక్క ప్రేరణ చేత దైవ కార్యం సఫలీకృతం చేయడంకోసం  శ్రమపడాలి, పునీత యాకోబు వలె వేదసాక్షి జీవితం జీవించాలని ప్రసంగించారు.

ఏలూరు పీఠాధిపతులు తమ వార్షికోత్సవం సందర్బంగా తమకు ఎంతగానో సహకరిస్తున్న గురువులకు, మఠవాసులకు దైవజనులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుడు తనను పీఠాధిపతిగా ఎన్నుకునందుకు వందన సమర్పణ దివ్యబలిపూజను సమర్పించారు.

ఏలూరు పీఠ గురువులు,ఇతర సభ మఠవాసులు, విశ్వాసులు పీఠాధిపతులవారిని ప్రేమతో సత్కరించారు.   
 

By Pujitha Nagalli

Online Producer