అద్భుత బాలయేసు మహోత్సవం

అద్భుత బాలయేసు మహోత్సవం

విశాఖ అతిమేత్రాసనం, బొబ్బిలి విచారణ, బాలయేసు నగర్ లో అద్భుత బాలయేసు మహోత్సవ త్రిదిన ప్రార్ధనలు మొదలయ్యాయి.ఈ త్రిదిన ప్రార్ధనలు జనవరి  29, 30, 31 తేదీలలో జరగనున్నాయి.  త్రిదిన ప్రార్థనలు ప్రతిరోజు సాయంత్రం 5:30గం లకు ప్రారంభమౌతాయి.

బొబ్బిలి విచారణ ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ  మహోత్సవ వేడుకలు జరగనున్నవి. గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారు బొబ్బిలి మరియు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేస్తూ ప్రజలను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్నారు.

మొదటి రోజు త్రిదిన ప్రార్ధనలలో  భాగంగా మైనర్ సేమినరి రెక్టర్, విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ  డి. పరంజ్యోతి గారు పాల్గొన్నారు.  గురుశ్రీ  డి. పరంజ్యోతి గారు ఇతర గురువులతో కలసి పవిత్ర దివ్యపూజ బలిని సమర్పించారు.
అద్బుత బాలయేసు అనే ధ్యానాంశం మీద ప్రసంగించారు. ఉజ్జివ ప్రసంగికులు గురుశ్రీ తెలగాని సురేష్ గారు ఈ త్రిదిన ప్రార్ధనలో  పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసారు.

 గురుశ్రీ బెంజిమన్  గారు తన సహాయ సహకారాలను అందించారు. అధికసంఖ్యలో విచారణ ప్రజలు ,యువతీ యువకులు పాల్గొన్నారు. విచారణ గాయక బృందం ప్రభు యేసుని స్మరిస్తూ మధురమైన గానాలను ఆలపించారు.     

పండుగ రోజు  01-02-2024 గురువారం నాడు జరగనున్నది. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక, ఉజ్జివ ప్రసంగికులు గురుశ్రీ పి. జీవన్ బాబు గారు పాల్గొని  అమూల్యమైన దైవవాక్కుని ప్రజలకు అందించనున్నారు.పండగకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి విచారణ గురువులు గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారు  ధన్యవాదాలు  తెలిపారు. పండగకు ప్రజలందరినీ ప్రేమతో ఆహ్వానించారు.  

 

Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer