‘హీల్ ది వరల్డ్’తో శాంతి సందేశం
‘హీల్ ది వరల్డ్’తో శాంతి సందేశం.. 350 మందికి పైగా విద్యార్థుల శాంతి ప్రతిజ్ఞ
శాంతి, ఆశ, ఐక్యత సందేశాన్ని చాటేందుకు హైదరాబాద్లోని క్రైస్తవ విద్యాసంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ‘హీల్ ది వరల్డ్ – వాయిసెస్ ఆఫ్ పీస్’ కార్యక్రమాన్ని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్ (St. Francis College for Women)నిర్వహించింది. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. ఉమా జోసెఫ్ గారి అద్వర్యం లో జరిగింది.
పేదల పట్ల అపారమైన ప్రేమ కలిగిన నాయకుడు.. నిరాడంబరతకు నిలువెత్తు రూపం..సిరో-మలబార్, శంషాబాద్ అగ్రపీఠాధిపతులు మహా ఘన ప్రిన్స్ అంతోని గారు ఈ కార్యక్రమంలో పాల్గొని, “శాంతి మనలో నుంచే ప్రారంభమవుతుంది” అంటూ అమూల్యమైన శాంతి సందేశాన్ని యువతకు అందించారు.
తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) చైర్మన్ మరియు సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు శ్రీ దీపక్ జాన్ , సిస్టర్ అల్ఫోన్సా వట్టోలి గార్లు , ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న పలు క్రైస్తవ విద్యాసంస్థలకు చెందిన 350 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులంతా కలిసి ‘హీల్ ది వరల్డ్’ గీతాన్ని ఆలపించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అనంతరం విద్యార్థులు శాంతి ప్రతిజ్ఞ చేశారు. సమాజంలో శాంతి, పరస్పర గౌరవం, ఐక్యతను పెంపొందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
యువతలో మానవతా విలువలు, సామాజిక బాధ్యత, శాంతి పట్ల అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.
Article and Design: M. Kranthi Swaroop
