ప్రపంచ శాంతి కోసం దేవుని మార్గదర్శనం అవసరం - పొప్ లియో
ప్రపంచ శాంతి కోసం దేవుని మార్గదర్శనం అవసరం - పొప్ లియో
మే నెల చివరి రోజున ఆదివారంనాడు సెయింట్ పీటర్స్ స్క్వేర్లో జరిగిన ఏంజెలస్ ప్రార్థనలో పరిశుద్ధ లియో XIV పాపు గారు శాంతి కోసం ప్రార్థించమని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రార్థనలలో 20,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భముగా పరిశుద్ధ లియో XIV పాపు గారు శాంతి కోసం తన విజ్ఞప్తిని మరోసారి పునరుద్ఘాటించారు. ప్రపంచ నాయకులను న్యాయమైన మరియు శాశ్వతమైన శాంతి వైపు దేవుడు నడిపించాలని ప్రార్థించారు.
ఏంజెలుస్ ప్రార్థనల తర్వాత ఆయన పలకరించిన బృందాలలో పోలాండ్లోని పీకరీ మేరియన్ పుణ్యక్షేత్రానికి జరిగే వార్షిక యాత్రలో పాల్గొన్నవారిని కూడా పరిశుద్ధ లియో XIV పాపు గారు ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ పుణ్యక్షేత్రం పదిహేడవ శతాబ్దం నుండి మేరీ మాత భక్తికి కేంద్రంగా ఉంది. స్థానిక సంప్రదాయం ప్రకారం, ప్రతి సంవత్సరం మే నెలలో బాలురు, పురుషుల కోసం పదివేల మందికి పైగా పాల్గొనే ఒక పెద్ద యాత్ర జరుగుతుంది, అదే సమయంలో బాలికలు, మహిళల కోసం ఆగస్టు నెలలో దీనికి అనుగుణమైన యాత్ర నిర్వహించబడుతుంది.
Article and design by M Kranthi swaroop