భక్తియుతంగా ఒక్క రోజు ఉపవాస ప్రార్థన కూటమి

భక్తియుతంగా ఒక్క రోజు ఉపవాస ప్రార్థన కూటమి

విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంత వలస విచారణ, క్రీస్తురాజు పుణ్య క్షేత్రం లో" ఒక్క రోజు ఉపవాస ప్రార్థన  కూటమి పనసబద్ర నూతన దేవాలయంలో భక్తియుతంగా జరిగింది.  విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్ర సామంత వలస విచారణకర్తలు " గురుశ్రీ పి జీవన్ బాబు" గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది. గురుశ్రీ పి జీవన్ బాబు గారు విచారణ ప్రజలను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తూ  ప్రతినెలా రెండవ శనివారం ఈ ప్రార్థన కూటమిని  నిర్వహిస్తున్నారు.

 ప్రపంచ దేశాలు మరియు  కుటుంబాల మధ్య శాంతి సమాధానం కోసం, విద్యార్ధిని విద్యార్డుల కొరకు ఈ ఉపవాస ప్రార్థన కూటమిలో ముఖ్య ఉద్దేశంగా ప్రార్ధించారు. అక్టోబర్ 12 వ తేదీన జరిగింది ఈ ఉపవాస ప్రార్థన కూటమి ఉదయం 9.౩౦ గంటలకు ప్రారంభమైంది.  జపమాల, స్తుతి ఆరాధన, పాప సంకీర్తనలు, దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ,  దివ్య సత్ప్రసాద మహా ఆరాధన, మరియు స్వస్థత ప్రార్దనలు నిర్వహించారు.   

గురుశ్రీ ప్రేమ్ కుమార్ గారు అమూల్యమైన దైవ సందేశాన్ని విశ్వాసులకు అందించారు. గురుశ్రీ యేసు గారు విశ్వాసుల కొరకు ప్రార్ధించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గురువులందరిచే దివ్య పూజాబలిని భక్తియుతంగా నిర్వహించారు. విచారణ గాయకబృందం మధురమైన గీతాలను ఆలపించారు. విచారణ సిస్టర్స్, అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ యువత ఉపవాస ప్రార్థన కూటమిలో పాల్గొన్నారు.   

ప్రార్థనల అనంతరం ప్రజలందరికి ప్రేమ విందుని గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు  ఏర్పాటు చేసారు. ఉపవాస ప్రార్థన కూటమికి సహకరించిన ప్రతి ఒక్కరికి విచారణ గురువులు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు ధన్యవాదాలు  తెలిపారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer