జాతీయ నిరసన దినం -హైదరాబాద్ అగ్రపీఠం

హైదరాబాద్ అగ్రపీఠంలో ఆగస్టు 10, శనివారం ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదాను కోరుతూ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వారు బహిరంగ సభను నిర్వహించారు.

దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

మతం పేరుతో రాజ్యాంగం ప్రసాదించిన ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు దళిత క్రైస్తవులకు గత 75 సంవత్సరాలుగా అందకుండా పోతున్నాయన్నారు. ప్రభుత్వం తరఫున పలు రకాల కమిషన్లు వేసినప్పటికీ వాటి వలన దళిత క్రైస్తవులకు ఎటువంటి ప్రయోజనం లభించలేదన్నారు. 

ప్రభుత్వాలు దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలి 

ఈ కార్యక్రమంలో తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య డిప్యూటీ సెక్రటరీ గురుశ్రీ రాజు అలెక్స్ గారు, గురుశ్రీ బోస్కో SJ, జి విజయరాజు గారు తదితరులు పాల్గొన్నారు. 


 

Tags