ఘనంగా వేళాంగణిమాత మహోత్సవము

ఘనంగా వేళాంగణిమాత మహోత్సవము     

విశాఖ అతిమేత్రాసనం వేళాంగణిమాత దేవాలయం, కైలాసపురం విచారణలో వేళాంగణిమాత మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF, మరియు సహాయక గురువులు గురుశ్రీ జాన్ CMF ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

పండుగ రోజు ఉ॥ 6.30గంటలకు ఇంగ్లీషులో దివ్యబలిపూజను గురుశ్రీ జార్జ్ మట్టతిల్ CMF, గారు ఇతర గురువులతో కలసి సమర్పించారు. అనంతరం ఉ॥ 8.30 గం||లకు తెలుగులో దివ్యబలిపూజను గురుశ్రీ సి.హెచ్ ప్రశాంత్ కుమార్ CMF గారు సమర్పించారు.

 సా॥ 4.00 గం||లకు దేవమాత  తేరుతో  కైలాసపురం విధులలో పురప్రదక్షణను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అతిమేత్రాసన ఛాన్సలర్ మరియు  జ్ఞానాపురం విచారణకర్తలు  గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాశ్ గారు సమిష్టి దివ్యబలిపూజను నిర్వహించారు.

అధికసంఖ్యలో విచారణ ప్రజలు , సిస్టర్స్ , యువతీ యువకులు పాల్గొన్నారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను  ఆలపించారు.   

విచారణకర్తలు గురుశ్రీ సంతోష్ గారు ప్రజలందరికి  వేళాంగణిమాత మహోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

 

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer