సెయుటా వలస సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన పోప్
వేసవి సెలవుల అనంతరం నిర్వహించిన తొలి ఆదివారపు త్రికాల ప్రార్థన సందర్భంగా పోప్ లియో స్పెయిన్లోని సెయుటా ప్రాంతంలో నెలకొన్న వలస సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు సరిహద్దు దాటడంతో సియుటాలో మానవతా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో మరియమాత మధ్యవర్తిత్వం ద్వారా అక్కడ శాంతి, స్థిరత్వం, న్యాయం నెలకొనేలా దేవుడు అనుగ్రహించాలని పోప్ ప్రార్థించారు.
అదేవిధంగా, శ్రీసభలోని ప్రాచీన ఫ్రాన్సిస్కన్ సంప్రదాయమైన Pardon of Assisiను స్మరించిన పోప్, 1216లో మూడవ Pope Honorius ప్రారంభించిన ఈ ప్రత్యేక పూర్ణ పాప విమోచన వరాన్ని విశ్వాసులు భక్తితో ఆచరించాలని పిలుపునిచ్చారు.
తన సందేశం ముగింపులో పోప్ లియో ప్రపంచ శాంతి కోసం మరోసారి విజ్ఞప్తి చేశారు.
యుద్ధాలకు బదులుగా సంభాషణ, సామరస్యమే మార్గమని పునరుద్ఘాటిస్తూ, యుద్ధ బాధితుల కోసం ప్రార్థించారు. అలాగే వారికి మానవతా సహాయం అందిస్తున్న సేవాసంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
