ఐరోపాలో కార్చిచ్చు బాధితుల కొరకు ప్రార్థించిన పోప్
ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో విధ్వంసం సృష్టిస్తున్న కార్చిచ్చు ఘటనలతో బాధపడుతున్న ప్రజల పట్ల పోప్ లియో తన సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేశారు.
అలాగే బాధితులు, వారిని రక్షించేందుకు నిరంతరం శ్రమిస్తున్న అత్యవసర సేవలను అందిస్తున్న సిబ్బంది కోసం ప్రార్థించాలని విశ్వాసులందరినీ పోప్ఆహ్వానించారు.
ఫ్రాన్స్ నైరుతి ప్రాంతం, స్పెయిన్ మధ్య ప్రాంతాల్లో విస్తారంగా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది.
తీవ్ర ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, దీర్ఘకాలిక కరువు పరిస్థితులు ఈ మంటలను మరింత తీవ్రతరం చేస్తుండటంతో అత్యవసర సేవలను అందించే బృందాలు సహాయక చర్యలు నిరంతరం కొనసాగిస్తున్నాయి.
కాస్టెల్ గాండోల్ఫోలో ఆదివారం 26 జూలై జరిగిన త్రికాల ప్రార్థన అనంతరం పోప్ లియో మాట్లాడుతూ, “ఇటీవలి రోజుల్లో ఫ్రాన్స్, స్పెయిన్లోని పలు ప్రాంతాలను విధ్వంసకర కార్చిచ్చు ఘటనల నేపథ్యంలో, బాధితులందరికీ నా సానుభూతిని తెలియజేస్తున్నాను.
అలాగే వారి కోసం, ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న అత్యవసర సిబ్బంది కొరకు ప్రార్థించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను” అని పోప్అన్నారు.
“వృద్ధులు శ్రీసభకు, సమాజానికి దేవుడు ప్రసాదించిన అమూల్యమైన వరం. వారి బహుమతికి మనమందరం ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుదాం” అని పరిశుద్ధ పిత అన్నారు.
అలాగే తాతలు, అమ్మమ్మలు మరియు వృద్ధుల అమూల్యమైన పాత్రను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, వారి పట్ల ప్రేమ, శ్రద్ధ, తగిన సంరక్షణ, అవసరమైన సహాయాన్ని ఎల్లప్పుడూ అందించాలని ఆయన విశ్వాసులను ప్రోత్సహించారు.