మహారాణిపేటలో భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం

మహారాణిపేటలో భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం

విశాఖ అతి మేత్రాసనం, మహారాణి పేట విచారణ  పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో  మ్రాని కొమ్మల ఆదివారం ఘనంగా జరిగింది . విశాఖ అతి మేత్రాసన వికార్ జనరల్, మహారాణిపేట విచారణ ఆధ్యాత్మిక గురువులు ఫాదర్ డి బాలశౌరి గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో విశాఖ అగ్రపీఠాధిపతి  మహా పూజ్య ఉడుమల బాల గారు పాల్గొని అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. ఉదయం 6:30 గంటలకు పునీత అంతోని హై స్కూల్ నుండి  ప్రజలందరూ మ్రాని కొమ్మలను పట్టుకొని అగ్రపీఠాధిపతులు, గురువులతో కలసి పాదయాత్రగా పునీత అంతోని వారి దేవాలయానికి చేరుకున్నారు.

మహా పూజ్య  ఉడుమల బాల గారు ఇతర గురువులతో కలసి  దివ్యబలి పూజను సమర్పించారు. మహా పూజ్య ఉడుమల బాల గారు యేసు ప్రభువుని యెరూషలేము పురప్రవేశము’ను వివరిస్తూ అమూల్య మైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు.  విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో  ఫాదర్  శివ్వం సుధాకర్ , ఫాదర్  కె వేలంగాని  రాజు , ఇతర గురువులు  పాల్గొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ఫాదర్ డి బాలశౌరి గారు కృతజ్ఞతలు తెలియజేసారు.

 

Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer