క్రైస్తవ జీవితానికి దివ్య సత్ప్రసాదం “అత్యవసరం”

క్రైస్తవ జీవితానికి  దివ్య సత్ప్రసాదం  “అత్యవసరం”

ఆదివారం నాడు, సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సమావేశమైన విశ్వాసులను ఉద్దేశించి పరిశుద్ధ XIV వ  లియో పాపు గారు ప్రసంగించారు. ఆదివారం నాటి సువార్తపై ధ్యానం చేశారు. ఈ సందర్భముగా  విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి దివ్య సత్ప్రసాదం అత్యవసరమని పరిశుద్ధ  లియో పాపు గారు అన్నారు. 

"క్రైస్తవ జీవితానికి  దివ్య సత్ప్రసాదం అనివార్యం" కాబట్టి, ఆదివారం జరిగే దివ్యబలిలో పాల్గొనడం అత్యవసరం అని పరిశుద్ధ  లియో పాపు గారు నొక్కి చెప్పారు.

ఈ కారణంగానే, ప్రతి ఆదివారం రోజు'న, దివ్య సత్ప్రసాదాన్ని జరుపుకోవడానికి విశ్వాసులను సమావేశపరచమని సంఘం ఆహ్వానిస్తుందని ఆయన కొనసాగించారు. "దివ్యబలి పూజ  సమయంలో, మనం మన ప్రభువైన యేసు క్రీస్తువారి మాటలను వింటాము, ప్రార్థిస్తాము, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాము అని అన్నారు .. ఆయన శరీరం మరియు రక్తం మనకు పోషణనిస్తాయి, తద్వారా మనం కూడా ఆయన పునరుత్థానానికి సాక్షులుగా మారగలము అని పరిశుద్ధ  లియో పాపు గారు అన్నారు.

దివ్య సత్ప్రసాదంలోనే విశ్వాసం వృద్ధి చెంది బలపడుతుందని, మరియు విశ్వాసులు ఒకే శరీరంలోని సభ్యులుగా ఏకమవుతారని పరిశుద్ధ  లియో పాపు గారు వివరించారు. " మన ప్రయత్నాలు, పరిమితమైనప్పటికీ, సమస్త మానవాళిని ఆవరించే ఒకే గొప్ప రక్షణ ప్రణాళికను సాధించడం కోసం... దేవుని కృపచే ఏకం చేయబడతాయి" అని అయన అన్నారు. 

మత్తయి సువార్త 26:26-28 లో చూసినట్లయితే "వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి, త్రుంచి, తన శిష్యులకు ఇచ్చుచు, “దీనిని మీరు తీసికొని భుజింపుడు. ఇది నా శరీరము” అనెను.
27. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని, కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరు అందరు త్రాగుడు.
28. ఇది అనేకుల పాపపరిహారమునకై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము". అని బైబిల్ లో వ్రాసి ఉన్నది 

ఈ పవిత్ర నిబంధన కృప అందరిపై నిలిచియుండునట్లు, అప్పమును ద్రాక్షారసమును విశ్వాసులందరికీ అందునట్లు  ప్రార్థిద్దాం. 

 

Article and Design By m kranthi Swaroop