నైజీరియాలో భయానక ఊచకోత బాధితుల కొరకు ప్రార్ధించిన పోప్

నైజీరియాలోని Benue రాష్ట్రంలో జరిగిన "భయంకరమైన ఊచకోత" బాధితుల కొరకు పోప్ లియో జూన్ 15 న ప్రత్యేకంగా ప్రార్థించారు.

జూన్ 13/14 రాత్రి Guma స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని Yelwataలో సుమారు 200 మంది "క్రూరంగా చంపబడ్డారు" - వారిలో ఎక్కువ మంది "స్థానిక కాథలిక్ మిషన్ ద్వారా ఆశ్రయం పొందిన" అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తులు.

ఆదివారం త్రికాల ప్రార్థనకు ముందు పోప్ నైజీరియాలో "హింసకు ఎడతెగని బాధితులైన బెన్యూ రాష్ట్రంలోని గ్రామీణ క్రైస్తవ సంఘాలలో  "భద్రత, న్యాయం మరియు శాంతి నెలకొనాలని ప్రార్థించారు.

దాడికి ప్రతిస్పందిస్తూ, Amnesty International Nigeria శనివారం జూన్ 14 న బెన్యూ రాష్ట్రంలో దాదాపు రోజువారీ రక్తపాతాన్ని వెంటనే ముగించి, నిజమైన నేరస్థులను న్యాయం ముందు తీసుకురావాలని నైజీరియా అధికారులను కోరింది 

Tags
Telugu Survey Popup Image