ఘనంగా మహా పూజ్య కరణం ధమన్ కుమార్ గారి పీఠాధిపత్య అభిషేక మహోత్సవం

ఘనంగా జరిగిన మహా పూజ్య కరణం ధమన్ కుమార్ గారి పీఠాధిపత్య అభిషేక మహోత్సవం

నల్గొండ  మేత్రాసనానికి నూతన పీఠాధిపతిగా నియమితులైన మహా పూజ్య కరణం ధమన్ కుమార్ MSFS  గారి పీఠాధిపత్య అభిషేక మహోత్సవం 30 ఏప్రిల్ 2024 న నల్గొండ లోని సెయింట్ అల్ఫోన్స్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది.

ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రంలో  అపోస్టోలిక్ న్యూన్షియో మహా పూజ్య లియోపోల్డో గిరెల్లి గారు పాల్గొన్నారు. దివ్యబలిపూజను హైద్రాబాద్ అగ్రపీఠాధిపతి కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారితో కలిసి ఇతర పీఠాధిపతులు, నల్గొండ మేత్రాసన గురువులు మరియు వివిధ మేత్రాసనాల గురువులు  కలిసి నిర్వహించారు.

ఏలూరు పీఠాధిపతి  మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి  మహా పూజ్య పొలిమేర జయరావు, D.D. గారు దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు,  మహా పూజ్య పొలిమేర జయరావు, D.D.  గారు మరియు మహా పూజ్య చిన్నబతిని భాగయ్య గార్లు  సమిష్టిగా నూతన పీఠాధిపతి అభిషేకించారు.
   
దివ్యబలిపూజ అనంతరం నూతన పీఠాధిపతి మహా పూజ్య ధమన్ కుమార్  గారు తన అభిషేక మహోత్సవానికి విచ్చేసిన వారందరికి తన హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు.

 

Article and Design By

M. Kranthi Swaroop

 

     

Telugu Survey Popup Image