క్రీస్తు మార్గంలో నడిచే గురువులుగా ఉండండి - పొప్ లియో
క్రీస్తు మార్గంలో నడిచే గురువులుగా ఉండండి - పొప్ లియో
ఆదివారం సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పరిశుద్ధ లియో పాపు గారు పది మంది డీకన్లను గురువులుగా అభిషేకించారు. పారిష్ సంఘాలతో ఐక్యంగా ఎదగాలని, మరియు ప్రజలందరినీ స్వాగతించే విధంగా ఉండేలా చూడాలని ఆయన వారిని ఆహ్వానించారు.
ఏప్రిల్ 26న జరిగిన దివ్యబలి పూజలో, పరిశుద్ధ లియో పాపు గారు యోహాను సువార్తను ఆధారంగా చేసుకొని ప్రసంగించారు. ఈ సందర్భముగా మన ప్రభువైన యేసు క్రీస్తు వారి మాటలను గుర్తుచేసుకున్నారు.
నూతనంగా గురువులైన వారిని ఉద్దేశిస్తూ ఇది "సహవాస పరిచర్య" అని అభివర్ణించారు. గురువులు మన ప్రభువైన యేసు క్రీస్తుతో సన్నిహిత సంబంధం కలిగి జీవించాలని అన్నారు .
క్రీస్తు వారి జీవితం స్వయంగా సేవ, ప్రేమ, మరియు త్యాగానికి నిదర్శనం అని, ఆయనతో నిజమైన అనుబంధం కలిగిన గురువు , తన వ్యక్తిగత ఆధ్యాత్మికతలో మాత్రమే కాదు, సమాజంలోనూ ప్రేమను పంచే వాడిగా మారుతాడు అని అయన అన్నారు.
చివరిగా పరిశుద్ధ లియో పాపు గారు, 23వ కీర్తనలోని మాటలను గుర్తుచేస్తూ, దేవునిపై నమ్మకమనే సాక్ష్యాన్ని తెలుపుతూ తన ప్రసంగాన్ని ముగించారు.
Article and design by M kranthi swaroop