కాంగోలో ఎబోలా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టాలి: పోప్ లియో

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాప్తి వల్ల ప్రభావితమైన ప్రజలకు మరియు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో గనుల ప్రమాద బాధితులకు అంతర్జాతీయ సహాయం అందించాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు పిలుపునిచ్చారు.

కాంగోలో ఎబోలా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టాలి: పోప్ లియో 


డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాప్తి వల్ల ప్రభావితమైన ప్రజలకు మరియు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో గనుల ప్రమాద బాధితులకు అంతర్జాతీయ సహాయం అందించాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు పిలుపునిచ్చారు. 

ఆగస్టు 23న సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఏంజెలుస్ ప్రార్థన సందర్భముగా  పరిశుద్ధ లియో XIV పాపు గారు మాట్లాడుతూ  ఎబోలా కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ప్రజలను తన ప్రార్థనల్లో ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటున్నానని తెలిపారు.

ఎబోలా వ్యాప్తిని నియంత్రించేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని పోప్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రయత్నాల్లో స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేసి, వ్యాధి నివారణ చర్యలను బలోపేతం చేయాలని, తద్వారా అనేక ప్రాణాలను కాపాడగలమని ఆయన అన్నారు.

ప్రస్తుతం కాంగోలో వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్ కారణంగా వేలాది కేసులు నమోదై, 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వ్యాధి నియంత్రణకు సాయుధ ఘర్షణలు, ఆరోగ్య మౌలిక వసతుల కొరత వంటి సమస్యలు కూడా అడ్డంకిగా మారుతున్నాయి.

అదే సమయంలో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లోని జాంబోయే ప్రాంతంలో గనిలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కూడా పోప్ తన సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేసి, గనుల ప్రాంతాల్లో భద్రత మరియు చట్టబద్ధతను నిర్ధారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

Article and Design BY M kranthi Swaroop

Telugu Survey Popup Image