ఒకే క్రీస్తు - ఒకే సాక్ష్యం... క్రీస్తు పునరుత్థాన ద్విసహస్రాబ్ది ఉత్సవం

ఒకే క్రీస్తు - ఒకే సాక్ష్యం... క్రీస్తు పునరుత్థాన ద్విసహస్రాబ్ది ఉత్సవం
జూబ్లీ 2033

క్రీస్తు మరణం, పునరుత్థానం (ఉత్థానం) మరియు స్వర్గారోహణ జరిగి 2,000 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, 2033వ సంవత్సరంలో 'క్రీస్తు విమోచన  జూబ్లీ' (Extraordinary Jubilee Year of Redemption) ఉమ్మడిగా జరుపుకోవాలని ప్రపంచవ్యాప్త క్రైస్తవులందరికీ పోప్ లియో XIV మరియు వివిధ అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు పిలుపునిచ్చాయి.

పరిశుద్ధ లియో XIV పాపు గారు  రోమ్‌లో కాన్‌స్టాంటినోపుల్ ఎక్యుమెనికల్ పాట్రియార్కేట్ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రపంచంలో యుద్ధాలు, విభేదాలు పెరుగుతున్న ఈ కాలంలో క్రైస్తవులందరూ తమ మధ్య ఉన్న భేదాలను పక్కనబెట్టి ఐక్యంగా నిలవాలని కోరారు. 2033వ సంవత్సరపు విమోచన మహోత్సవాన్ని కాథలిక్, ఆర్థోడాక్స్, ప్రొటెస్టంట్, మరియు ఎవెంజలికల్ వంటి అన్ని క్రైస్తవ విభాగాలు కలిసి ఒకే సాక్ష్యంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 

క్రైస్తవులు శాంతికి విశ్వసనీయమైన చిహ్నంగా ఉండాలని పిలువబడ్డారు అని , శాంతిని నిర్మించడానికి సద్భావన గల స్త్రీపురుషులందరూ చేస్తున్న ప్రయత్నాలకు నిర్ణయాత్మక సహకారం అందించాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు పిలుపునిచ్చారు.

Article and Design by M kranthi Swaroop