"ఆరాధనా క్రమ నియమాలను" గౌరవించండి - పొప్ లియో

"ఆరాధనా క్రమ నియమాలను" గౌరవించండి - పొప్ లియో  

దేవాలయాలలో ప్రార్థనల సమయంలో గందరగోళాన్ని నివారించడానికి, సంఘ సభ్యులందరూ ఏకమై ప్రార్థించడాన్ని ప్రోత్సహించడానికి పరిశుద్ధ లియో XIV పాపు గారు  గురువులకు మరియు మతాధికారులకు ముఖ్యమైన పిలుపునిచ్చారు.

మే 27న జరిగిన సాధారణ సమావేశంలో , విశ్వాసులను గందరగోళానికి గురిచేయకుండా ఉండేందుకు, ఫాదర్ లు  "ఆరాధనా క్రమ నియమాలను" గౌరవించాలని మరియు "వారి స్వంత చొరవతో" దివ్యబలి పూజలో మార్పులు చేయవద్దని పరిశుద్ధ లియో XIV పాపు గారు  విజ్ఞప్తి చేశారు.

సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పరిశుద్ధ లియో XIV పాపు గారు మాట్లాడుతూ, ఫాదర్‌లు ఆరాధనా గ్రంథాలు మరియు నియమాలను వినయంతో, విశ్వాసంతో గౌరవించాలని పిలుపునిచ్చారు."ఆరాధనా క్రమంలో సరైన సంప్రదాయంతో ముందుకు సాగాలి   అని మరియు ఆరాధనా క్రమంలోని కొన్ని అంశాలు దైవికంగా స్థాపించబడినందున వాటిని ఎప్పటికీ మార్చకూడదని రెండవ వాటికన్ కౌన్సిల్ ధృవీకరించింది," అని ఆయన అన్నారు.

ప్రార్థనలు కేవలం వ్యక్తిగత అవసరాలపైనే కాకుండా, సంఘ సభ్యులందరూ  ఒకే శరీరంగా కలిసి ప్రార్థించేలా ఉండాలని సూచించారు.బిషప్ లు, ఫాదర్ లు  తమకు నచ్చిన విధంగా ఆచారాలను మార్చడం లేదా ప్రదర్శనల కోసం ఆరాధనలను వక్రీకరించకూడదని హెచ్చరించారు.

ఫాదర్ లు కేవలం నియమాలను అనుసరించే యంత్రాలు కాదని, ప్రజలను ప్రార్థనలో మరియు దేవుని కృపలో నడిపించే మార్గదర్శకులుగా ఉండాలని  పరిశుద్ధ లియో XIV పాపు గారు పేర్కొన్నారు.

 

Article and Design By M Kranthi Swaroop