అమృతవాణి భవన నిర్మాణ జూబిలీ ప్రారంభం

అమృతవాణి భవన నిర్మాణ జూబిలీ
తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య సాధారణ సమావేశం

ఆంధ్ర, తెలంగాణ కథోలిక శ్రీసభకు ఎనలేని సేవలు అందించిన అమృతవాణి సికిందరాబాదు లో ఉంది. అక్కడి అమృతవాణి భవనాన్ని నిర్మించి అమృతవాణి కార్యాలయంగా ప్రారంభించి 50 వ సంవత్సరం సందర్భంగా జూబిలీ చిహ్నాన్ని ప్రారంభించారు.

తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య సాధారణ సమావేశం లో ఈ జూబిలీ చిహ్నాన్ని ఆవిష్కరించారు. తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షులు, మహా పూజ్య కార్డినల్ పూల అంతోని, అమృతవాణి అధ్యక్షులు మహా పూజ్య ఉడుమల బాల మరియు ఇతర పీఠాధిపతులు ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. 

అమృతవాణి నిర్దేశకులు గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు అమృతవాణి వార్షిక నివేదికను సమర్పించారు.