హైతీ మారణకాండపై పోప్ లియో ఆవేదన
నేపాల్ మరియు టిబెట్ ప్రాంతాలను అతలాకుతలం చేసిన భారీ వరదల్లో మృతిచెందిన వారి కోసం కాస్టెల్ గాండోల్ఫో లో పోప్ లియో ప్రార్థించారు.
ఈ విపత్తులో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
“ప్రాణాలు కోల్పోయిన వారి కొరకు, గాయపడిన వారి కొరకు, ఆచూకీ తెలియని వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, అలాగే సహాయక చర్యలు అందిస్తున్న సిబ్బంది కొరకు మనం ప్రార్థిద్దాం అని పోప్ అన్నారు
మన సంఘీభావ చర్యలు వారి బాధను కొంతైనా తగ్గించి, బాధిత ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు దోహదపడాలని కోరుకుందాం.”
భారీ ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాల్లో పోప్ లియో "పాపల్ ఛారిటీస్ కార్యాలయం" ద్వారా బాధితులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.
ఇదే సమయంలో, హైతీలో జరిగిన ఘోర మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారిని కూడా పోప్ గుర్తుచేసుకున్నారు.
సాయుధ ముఠాలు జరిపిన దాడిలో కనీసం 47 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు అపహరణకు గురయ్యారు.
“హైతీ నుంచి విషాదకరమైన వార్తలు అందుతున్నాయి. Kenscoff ప్రాంతంలో జరిగిన భయానక మారణకాండలో అనేకమంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు అపహరణకు గురయ్యారు.
మృతుల కుటుంబాల పట్ల నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. బాధితుల కోసం ప్రార్థిస్తున్నాను అని పోప్ అన్నారు
అపహరించబడిన బందీలందరినీ తక్షణమే విడుదల చేయాలని నేను పిలుపునిస్తున్నాను.”
అనంతరం,ఆగస్టు 28న జరుపుకున్న పునీత అగస్టీను మహోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన చెప్పిన ఒక సూక్తిని కూడా పోప్ ప్రస్తావించారు.
చివరగా, కాస్టెల్ గాండోల్ఫోలో తన విశ్రాంతి సమయంలో భద్రత కల్పించిన భద్రతా సిబ్బందికి పోప్ లియో కృతజ్ఞతలు తెలిపారు.
