బిషప్‌లు దేవుని సేవకు పూర్తిగా అంకితమైన జీవితం కలిగి ఉండాలి - పోప్ లియో

బిషప్‌లు దేవుని సేవకు పూర్తిగా అంకితమైన జీవితం కలిగి ఉండాలి - పోప్ లియో 

బిషప్‌ల జూబ్లీ కోసం చేసిన ధ్యానంలో పరిశుద్ధ పోప్ లియో XIV  గారు  పీఠాధిపతులు  (బిషప్‌లు) "దేవునిలో దృఢంగా ఉండాలని  మరియు దేవుని సేవకు పూర్తిగా అంకితమైన జీవితం కలిగి ఉండడం"  ద్వారా ఆశకు సాక్షులుగా ఉండాలని కోరారు. 

జూన్ 25న సెయింట్ పీటర్స్ బసిలికలో పరిశుద్ధ పోప్ లియో XIV గారు బిషప్‌ల జూబ్లీలో పాల్గొనేవారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసారు. 

38 దేశాల నుండి 400 మందికి పైగా పీఠాధిపతు(బిషప్‌)లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  వాటికన్ బిషప్‌ల డికాస్టరీ యొక్క రిటైర్డ్ ప్రిఫెక్ట్ మహా పూజ్య కార్డినల్ మార్క్ ఓయెల్లెట్ అధ్యక్షతన దివ్యబలిపూజ ఘనంగా జరిగింది. 

బిషప్‌ల జూబ్లీ కొరకు  బుధవారం నాడు సెయింట్ పీటర్స్ బసిలికా పవిత్ర ద్వారం నుండి ప్రవేశించిన పీఠాధిపతుల(బిషప్‌ల)ను ఉద్దేశించి పోప్ లియో XIV గారు మాట్లాడుతూ " బిషప్‌లు కాపరులుగా ఉండటానికి ముందు, ప్రభువు మందలోని సభ్యులు" అని అన్నారు. 

బిషప్ అంటే లోతైన విశ్వాసం ఉన్న వ్యక్తి, అతను ఆశతో నిండి ఉంటాడు మరియు తన ప్రజలకు దగ్గరగా ఉంటాడు అని పోప్ లియో XIV అన్నారు.

మన సంరక్షణకు అప్పగించబడిన శ్రీసభను మనం నడిపించాలంటే, మంచి కాపరి అయిన యేసు ప్రభువు వారిని మన హృదయంలోకి ఆహ్వానించాలని, మరియు ఆయన ప్రేమ, కృపను పొందుకొనేలా మనం నూతనపరచబడాలి" అని పరిశుద్ధ పోప్ లియో XIV గారు అన్నారు.

కొన్ని బాధాకరమైన పరిస్థితులలో కూడా, ఆటుపోట్లకు తట్టుకోవాలని  " అని ఆయన అన్నారు.  "మనం బాధపడేవారికి నిజంగా దగ్గరగా ఉంటే, పరిశుద్ధాత్మ వారి హృదయాలలో దాదాపుగా ఆరిపోయిన జ్వాలను కూడా పునరుద్ధరించగలదు." అని అన్నారు. 

బిషప్‌లు "మానవ సద్గుణాలను పెంపొందించుకోవడానికి" పిలువబడ్డారని ఆయన అన్నారు, ముఖ్యంగా రెండవ వాటికన్ కౌన్సిల్లో వివరించినట్లుగా న్యాయంగా ఉండటం, నిజాయితీ, స్వీయ నియంత్రణ, సహనం, వినగల సామర్థ్యం మరియు సంభాషణలో పాల్గొనడం మరియు సేవ చేయడానికి ఇష్టపడటం వంటివి  బిషప్ యొక్క ఇతర ముఖ్యమైన ధర్మాలు ఉన్నాయి అని అన్నారు. 

పరిశుద్ధ పోప్ లియో XIV గారు పీఠాధిపతు(బిషప్‌)లకు అవసరమైన అనేక ఇతర సద్గుణాలను ప్రస్తావిస్తూ  ముఖ్యంగా "మతసంబంధమైన వివేకం, సువార్త పేదరికం మరియు బ్రహ్మచర్యంలో పరిపూర్ణ నిగ్రహం యొక్క ముఖ్యమైన సద్గుణాలను" తెలిపారు.

పీఠాధిపతుల(బిషప్‌ల) మోషే లాగా విశ్వాసం ఉన్న వ్యక్తి అని,  "దేవుని కృపతో, ముందు చూపుతో లక్ష్యాన్ని చూస్తాడు మరియు పరీక్ష సమయాల్లో పట్టుదలతో ఉంటాడు" అని ఆయన అన్నారు.

Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer