ప్రభుని పలుకులు ఆలకించి నూతన జీవం పొందమన్న పోప్

22 మార్చి, 2026 తపస్సు కాల ఐదవ ఆదివారం వాటికన్ లో త్రికాల ప్రార్ధన సందేశంలో పోప్ లియో లాజరు పునరుత్థాన సువార్తపై ధ్యానించారు.

క్రీస్తు మరణంపై విజయం సాధించారని,జ్ఞానస్నానం ద్వారా మనకు నిత్యజీవం లభిస్తుందని పోప్ తెలిపారు.

పవిత్ర వారం ముందు వచ్చే ఈ సువార్త పఠణాలు మనకు యేసు శ్రమలు, మరణం, పునరుత్థాన సంఘటనలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు సిద్ధం చేస్తుందని ఆయన తెలిపారు. 

దేవుని కృప ప్రపంచాన్ని వెలిగిస్తుందని, కానీ మనుషులు తాత్కాలిక సంతోషాల కోసం వెతుకుతూ నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారని అన్నారు.

మన హృదయాలను స్వార్థం, భౌతికవాదం, ఉపరితల జీవన విధానాల నుంచి విముక్తి చేసి, యేసు పిలుపు “బయటకు రండి” అనే పిలుపు విని ప్రేమలో కొత్త జీవితాన్ని జీవించాలని పోప్ పిలుపునిచ్చారు.

త్రికాల ప్రార్థన పఠనానికి ముందు, "ఈ పవిత్ర వారమంతా మరియతల్లి విశ్వాసంతో గడపాలని ఆ తల్లి సహాయాన్ని కోరుకుందాం అని పోప్ అన్నారు.

Telugu Survey Popup Image