క్రైస్తవులు ఐక్యతను నిర్మించేవారుగా ఉండాలన్న పోప్

జూన్ 9న, పోప్ లియో తన స్పెయిన్ అపోస్టోలిక యాత్రలో రెండవ దశలో బార్సిలోనాను సందర్శించారు.

పోప్ లియో స్పెయిన్ పర్యటన బార్సిలోనాలోని హోలీ క్రాస్ మరియు సెయింట్ యూలాలియా కేథడ్రల్‌లో మధ్యాహ్న ప్రార్థనతో ప్రారంభమైంది.

విమానాశ్రయం నుండి నేరుగా వచ్చిన పోప్‌కు, బిషప్‌లు, కానన్‌లు, మేత్రాసన అధికారులు, గురువులు, గురువిద్యార్థులు, కేథడ్రల్ సిబ్బంది, వాలంటీర్లు మరియు పెద్ద సంఖ్యలో యువకులతో కూడిన ఉత్సాహభరితమైన జనసమూహం స్వాగతం పలికింది.

పోప్ లియో, దివ్య సత్ప్రసాదం ముందు ఒక క్షణం మౌన ప్రార్థన కొరకు ఒక ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత గాయక బృందం ప్రారంభ గీతాన్ని ఆలపిస్తుండగా, ఆయన ప్రధాన మందిరం గుండా ఊరేగింపుగా ముందుకు సాగారు.

స్పానిష్ మరియు కాటలాన్ భాషలతో చేసిన తన ప్రసంగంలో, పోప్ విశ్వాసులను రెండు ప్రతిమలపై ధ్యానం చేయమని ఆహ్వానించారు అవి వధువు మరియు దేహం.

దేవాలయము అన్నింటికంటే ముందుగా ఆ దేవునికి ఒక “ప్రియమైన వధువు” అని పోప్ లియో వివరించారు. 

“మీరు ఇక్కడ ఉండాలని దేవుడు సంకల్పించాడు, “ఎందుకంటే మీలో మరియు మీ ఐక్యతలో ఆయన ఒక విశిష్టమైన, పవిత్రమైన సౌందర్యాన్ని మరియు మంచితనాన్ని ప్రేమిస్తున్నాడు అని పోప్ అన్నారు 

బార్సిలోనాలో ఉన్న పరిశుద్ధుల సహవాసానికి నేడు ప్రాతినిధ్యం వహించడానికి ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడు.”

మనమందరం క్రీస్తుతో ఒకే శరీరం అని పోప్ గమనించారు, మరియు ఒక శరీరంలో ఉన్నట్లే, “కొందరు బలమైన అవయవాలు, మరికొందరు బలహీనమైన అవయవాలు ఉంటాయి”.

అంతేకాకుండా, సంఘంలోని కొందరు సభ్యులు “బయటి ప్రపంచానికి స్పష్టంగా కనిపించే విధులను నిర్వర్తిస్తూ కనబడుతుండగా,” మరికొందరు “లోపలి నుండి పనిచేస్తూ — కొన్ని సందర్భాల్లో ఎడతెరిపి లేకుండా, ఎవరికీ తెలియకుండా కీలకమైన విధులను నిర్వర్తిస్తూ” అజ్ఞాతంగా ఉంటారు.

ఇంతటి వైవిధ్యం నేపథ్యంలో, ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోప్ విశ్వాసులను ప్రోత్సహించారు: 

“మనం ఐక్యంగా ఉన్నందువల్లనే బలంగా ఉన్నాము, మరియు మనమంతా ఒకే పవిత్రాత్మ ఆత్మచే ప్రేరేపించబడ్డాము కాబట్టే ఐక్యంగా ఉన్నాము”.

యుద్ధాలు మరియు విభజనలతో అల్లకల్లోలమైన ప్రపంచంలో, అలాగే నానాటికీ ముక్కలవుతూ వ్యక్తిగత స్వార్థం వైపు మొగ్గు చూపుతున్న సమాజంలో, క్రైస్తవులు ‘సాక్షులు’గా (martyrs) నిలవాలని పోప్ పిలుపునిచ్చారు. 

Tags